రామాయంపేట, జూన్ 28: మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్కు పూజలు చేసి మాట్లాడారు. రామాయంపేటకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు కేటాయిస్తున్నారన్నారు.కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాసన్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు యాదగిరి, అనిల్కుమార్, సుందర్సింగ్, చిలుక గంగాధర్, టీఆర్ఎస్ నాయకులు దేవుని రాజు, మల్యాల కిషన్, యాద నాగరాజు, సిబ్బంది కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, కృష్ణ ఉన్నారు.
గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్క వార్డు సభ్యుడు కలిసి రావాలని రాయలపూర్ సర్పంచ్ భూమగారి నర్సాగౌడ్ అన్నారు. పంచాయతీ వార్డు స భ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వార్డుల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని తీర్మానం చేశా రు. మొక్కలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల ని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సమావేశం లో ఎంపీటీసీ భాగ్యమ్మ, ఉపసర్పంచ్, రెడ్డి నర్సవ్వ, కార్యదర్శి మహేందర్రెడ్డి, వార్డు స భ్యులు భాగ్యలక్ష్మి, ఇంద్ర, సార్గు రమేశ్, రా జు, నరేశ్, సత్తవ్వ, యాదమ్మ, ఎడ్ల సత్తయ్య, జిన్న అశోక్ ఉన్నారు.
హరితహారాన్ని విజయవంతం చేయాలి….
చేగుంట,జూన్28: గ్రామంలో ఇంటింటా మొక్కలు నాటుకోవాలని నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత అన్నారు. నార్సింగి మండల పరిధిలోని జెప్తిశివునూర్లో సర్పంచ్ షరీఫ్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు . కార్యక్రమంలో ఉపసర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ ,వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు హరితహారాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు.చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలు , డంపింగ్ యార్డులు త్వరగా పూర్తి చేయాలని, పల్లె ప్రకృతి వనాల్లో అన్ని రకాల మొక్కలను పెంచాలని ఎంపీపీ సూచించారు.కార్యక్రమంలోజడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమాదేవి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీవో ప్రశాంత్, మండలంలో అధికారులు ,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిజాంపేటలో…
నిజాంపేట,జూన్28: ఏడో విడత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి నిజాంపేట మండల వ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. నందిగామలో సోమవారం పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్ హూస్సేన్ హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల ఉపాధి కూలీలతో 400 గుంతలను తీయించారు.