20309 మంది రైతుల నుంచి 1,07,261.840 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ఈ ఏడాది పంట విలువ రూ.202 కోట్ల పైచిలుకు
7,478 మంది రైతులకు రూ.75కోట్ల పైగా చెల్లింపు
మిగిలిన వారికి త్వరలో అందనున్న డబ్బులు
దిగుబడి దండిగా రావడంతో అన్నదాతల ఆనందం
వికారాబాద్, జూన్ 21, (నమస్తే తెలంగాణ): కొవిడ్ కష్టకాలంలో రైతన్నల మోములో ఆనందం కనిపిస్తున్నది. గతేడాది ఇదే సమయంలో ప్రతికూల పరిస్థితులతో నష్టపోయిన రైతులు ఈ సంవత్సరం మాత్రం అధిక దిగుబడి సాధించారు. తెగుళ్లు సోకకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూ లిం చడంతో అనుకున్న ప్రకారం దిగుబడిని పొందారు. నిరంతరం ప్రజా ప్రతి నిధులు, అధికారులు మిలర్లతో సమీక్షలు జరిపి రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.202 కోట్ల 16లక్షల 39వేల 550ల విలువైన వరి పంటను జిల్లా రైతులు పండించారు.ఈ యాసంగిలో సగటున ఎకరా నికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గత యాసంగిలో 44వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిం చగా ఈ ఏడాది రికార్డును బద్దలు కొట్టారు. 90 శాతం పూర్తయిన ఎంట్రీలు.. జిల్లాలో 20,309 మంది రైతుల నుంచి 1,07,265.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆయా ఏజెన్సీలకు చెందిన 192 కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేక రించింది. ఇందులో 80 శాతం 20,309 మంది రైతుల్లో 12వేల 831 మంది రైతులకు సంబంధించి రూ.126లక్షల 59లక్షల 39వేల 550లు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే 7478 మంది రైతులకు రూ.75కోట్ల పైచిలుకు చెల్లింపులు జరిపారు. జిల్లాలోని 19 మండలాల్లో 66,112 ఎకరాల్లో వరి సాగు చేశారు.
మరో రెండు జిల్లాలకు బియ్యం జిల్లాలో అధికంగా వరి సాగవడంతో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. వికారాబాద్ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలకు ధాన్యం సరఫరా చేస్తు న్నారు. వికారాబాద్తో పాటుగా రంగారెడ్డి,కరీంనగర్ జిల్లాలకు ధాన్యాన్ని తీసుకెళ్లారు.ఈ జిల్లాలకు 84వేల మెట్రిక్ టన్నులు పంపించారు. కరీం నగర్ జిల్లాకు 11500, రంగారెడ్డి జిల్లాకు 3450, జిల్లాలోని గోదాంలకు 17400 మెట్రిక్ టన్నులు తీసుకెళ్లారు. ఇవి జిల్లాలోని చంద్రకళ, జఫర్పల్లి, నంది ట్యూబ్ టైర్స్, తాండూరు మార్కెటింగ్,తాండూరు గోదాం, తాండూరు దాల్ మిల్లు, మోమిన్పేట ఏఎన్ఆర్ ఫంక్షన్హాల్, రావులపల్లిలోని డీఎస్ఆర్ ఫంక్షన్, మర్పల్లి,పెద్దెముల్ తదితర ప్రాంతాల్లోని గోదాంలు, ఫంక్షన్ హాల్ ల్లో భద్రపర్చారు. వీటితో పాటుగా కొనుగోలు కేంద్రాల వద్ద మరో 22వేల మెట్రిక్ టన్నులు ఉన్నది. జిల్లాలోని రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యా నికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మూడు రోజు లుగా జిల్లాలోని ధారూర్, పరిగి, బొంరాస్పేట తదితర ప్రాంతాల్లో రైతుల వారీగా ఆరా తీస్తున్నారు. 20,309 మంది రైతులకు సంబంధించి విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం చేసింది. జిల్లాలో 192 కేంద్రాల ద్వారా ధాన్యం కొను గోలు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏఎంసీల ద్వారా ఈ కొను గోలు చేపట్టారు. వీటి ద్వారా 20,309 మంది రైతుల నుంచి లక్షా 7వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కాగా.. ఇప్ప టికే కొన్ని చోట్ల కొనుగోలు పూర్తి చేశారు. 192 కేంద్రాల్లో 35 కేంద్రాలను అధికారులు మూసివేశారు.7478 మంది రైతులకు రూ.75కోట్ల చెల్లింపులు జిల్లాలో 192 కేంద్రాల ద్వారా 20309 మంది రైతుల నుంచి 1,07,261.840 మెట్రిక్ టన్నుల్లో ధాన్యం కొనుగోలు చేశాం. కొను గోలు చేసిన వరి ధాన్యం విలువ రూ. 2,021,639,550 కోట్లు. ఇందులో ఇప్పటికే 7478 మంది రైతులకు రూ.75కోట్ల పైచిలుకు చెల్లింపులు జరిగాయి. 12వేల 831 మంది రైతులకు సంబంధించి రూ.126లక్షల 59లక్షల 39వేల 550లు చెల్లింపులు చేయాల్సి ఉంది. -విమల, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్