వికారాబాద్, జూన్ 21, (నమస్తే తెలంగాణ) : ప్రత్యేకంగా పది శాతం గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసి హరిత తెలంగాణగా మార్పుచేయటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. ఆరు విడుతల్లో తెలంగాణలో 210 కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. ఏడో విడుతలో 19.86 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 40లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నా రు. వికారాబాద్ జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి మూడుకోట్ల పైచిలుకు మొక్కలు నాటినట్టు మంత్రి తెలిపారు. హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మరి కొన్ని రోజు ల్లో సీఎం కేసీఆర్ పర్యటన జిల్లాలో ఉండడంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రత్యేకాధికారు లు, గ్రామాల సరిహద్దుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయించి,రోడ్లకు ఇరువైపులా మొక్క లు నాటి వాటిని సంరక్షించుకోవాలని సూచించారు.
గ్రామస్థాయిలో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల వరకు మున్సిపాలిటీలలో కౌన్సిలర్ల నుంచి చైర్మన్ల వరకు అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో ప్రతి వార్డు లో చిన్న పార్కు ఉండేలా, ఒక నర్సరీ కోసం కృషి చేయాలని, ప్రతి ఇంటికి ఆరు మొ క్కలు ఇవ్వాలన్నారు. పల్లెప్రకృతి వనాలు వారం లో పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 5 నుంచి 10 ఎకరాల్లో మండల ప్రకృతి వనాలకు స్థలాలు గుర్తించి ఎంపీపీ, జడ్పీటీపీలు అధికారులతో కలిసి చొరవ చూపాలన్నారు. నియోజకవర్గానికి ఒక నర్సరీ ఏర్పాటు చేయడానికి శాసన సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల వద్ద అవసరం మేరకు బోర్లు వేయాలన్నారు. రైతు వేదికలు,డంపింగ్ యార్డులు,వైకుంఠ ధామాల వద్ద గ్రీన్ ఫెన్సింగ్ వేయాలని, ఓపెన్ స్థలాల్లో మొ క్కలు నాటాలని పిలుపు నిచ్చారు.
శాసన సభ్యు లు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులు 33 శాతానికి పెరిగా యన్నారు. పాఠశాలలు జులై 1 నుంచి నుంచి ప్రారంభించాలని నిర్ణయించడంతో అధికారులు అందుకనుగుణంగా పాఠశాలలను సిద్ధం చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి,వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా కలెక్టర్ పౌసుమిబసు, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డి, రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళి కృష్ణ,అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల జిల్లాలోని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.