పారదర్శకంగా ఏఆర్ కానిస్టేబుళ్ల బదిలీలు

- సీపీ సత్యనారాయణ
ఫర్టిలైజర్సిటీ, జనవరి 21 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో పని చేస్తున్న 63 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు పారదర్శకంగా కౌన్సెలింగ్ విధానం ద్వారా బదిలీలు చేపట్టినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కమిషనరేట్ ఆవరణలో గురువారం 63 మంది సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ నుంచి ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 19 మంది కానిస్టేబుళ్లను కుమ్రంభీం అసిఫాబాద్కు, నిర్మల్ జిల్లాకు ఒక కానిస్టేబుల్ను డ్రా పద్ధతి ద్వారా పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అధికారులతో సమన్వయంగా ఉంటూ క్రమశిక్షణతో విధు లు నిర్వర్తించి ప్రజలతో మంచి సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిజాయితీతో పని చేసి పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ అశోక్కుమార్, అడిషనల్ డీసీపీ ఏఆర్ కమాండెంట్ సంజీవ్, ఏఆర్ ఏసీపీ నాగ య్య, సుందర్ రావు, ఆర్ఐలు మధూకర్, అనిల్, శ్రీధర్ ఉన్నారు.
తాజావార్తలు
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్లైన్స్
- పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
- ప్రపంచ కుబేరుల జాబితా : రూ 6.09 లక్షల కోట్లతో 8వ స్ధానంలో ముఖేష్ అంబానీ!
- ఆజాద్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ వర్కర్లు
- ధానాపూర్ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
- స్టన్నింగ్ లుక్లో నాగార్జున.. పిక్ వైరల్
- ఆస్ట్రేలియాలో బస్డ్రైవర్గా మారిన శ్రీలంక క్రికెటర్
- కూలీలతో కలిసి ప్రియాంక తేయాకు సేకరణ..వీడియో
- ధర్మపురిలో ‘సంకష్ట చతుర్థి’ పూజలు
- టీకా తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఎంపీ కేశవరావు, ఫారూక్ అబ్దుల్లా