కల్లాలను త్వరగా పూర్తి చేయాలి

- జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి
హాజీపూర్, జనవరి 21 : జిల్లాలో పంట కల్లాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు వినియోగంలోనికి తీసుకురావాలని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వైకుంఠధామాలు, డంప్ యార్డులు, మొక్కలు నాట డం, నర్సరీల నిర్వహణ, పల్లె పకృతి వనాల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇంకుడు గుంతలు, పల్లె ప్రగతి పనులు ఫిబ్రవరి 15వ తేదీలోగా అన్ని గ్రామాల్లో 100 శాతం పూర్తి చేయాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బ్యాంకుల జోరు:టాప్10 కంపెనీల ఎంక్యాప్ రూ.5.13 లక్షల కోట్లు రైజ్
- వైరల్ అవుతున్న చిరంజీవి ఆచార్య లొకేషన్ పిక్స్
- రేపటి నుంచి మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- న్యాక్ హైదరాబాద్కు సీఐడీసీ అవార్డు ప్రదానం
- ఆస్ట్రాజెనెకాను సస్పెండ్ చేసిన ఆస్ట్రియా ప్రభుత్వం
- తాగు నీటి ట్యాంక్కు టాయిలెట్ పైప్.. రైల్వేస్టేషన్ మాస్టర్ సస్పెండ్
- రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
- అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరిన నటుడు దేవన్
- బంగారం రుణం: యోనోతో నో ప్రాసెసింగ్ ఫీజు