న్యూఢిల్లీ : చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 15 పైసల వరకు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.66కు చేరగా.. డీజిల్ రూ.87.41కు పెరిగింది. మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇంధన ధరలు 26వసార్లు పెరిగాయి. ఇప్పటి వరకు చమురు కంపెనీలు రూ.6.34, డీజిల్పై రూ.6.63 వరకు పెరిగింది. మరో వైపు రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్రూ.107.79, లీటర్ డీజిల్రూ.100.51కు పెరిగింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్ను దాటింది. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. ఆసిఫాబాద్లో పెట్రోల్ రూ.102.08, డీజిల్ రూ.96.78కు చేరింది.
వివిధ నగరాల్లో ఇంధన ధరలు
ఢిల్లీలో పెట్రోల్ రూ.96.66, డీజిల్ రూ.87.41
ముంబై పెట్రోల్ రూ.102.82, డీజిల్ రూ.94.84
హైదరాబాద్లో పెట్రోల్ రూ.100.46, డీజిల్ రూ.95.28
విజయవాడలో పెట్రోల్ రూ.102.42, డీజిల్ రూ.96.67
చెన్నైలో పెట్రోల్ రూ.97.91, డీజిల్ రూ.94.04
కోల్కతాలో రూ.96.58, డీజిల్ రూ.90.25
భోపాల్లో రూ.104.85, డీజిల్ రూ.96.05
రాంచీలో పెట్రోల్ రూ.92.70, డీజిల్ రూ.92.27
బెంగళూరులో రూ.99.89, డీజిల్ రూ.92.66
పాట్నాలో రూ.98.73, డీజిల్ రూ.92.72
చండీగఢ్లో రూ.92.96, డీజిల్ రూ.87.05
లక్నోలో పెట్రోల్ రూ.93.88, డీజిల్ రూ.87.81
ఇవి కూడా చదవండి..