హైదరాబాద్ : తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. బీజేపీలో చేరకముందు ఈటలకు పరాభవం ఎదురైందని, పార్టీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల ఎందుకు చేరలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఆస్తులను కాపాడుకోవడం మినహా ఏం ఉద్ధరిద్దామని ఈటల బీజేపీలో చేరారు. నిన్నమొన్నటి వరకు నల్ల చట్టాలు, టీకాల వ్యవహారంపై బీజేపీని విమర్శించిన ఈటల ఆ పార్టీలోనే చేరడం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఈటలకు రాజకీయ భవిష్యత్ను ఇచ్చిందని, పార్టీలో అన్ని పదవులను అనుభవించి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన విజ్ఞతకు నిదర్శమని అన్నారు. అన్నంపెట్టిన పార్టీపై విమర్శలు సరికాదని హితవు పలికారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.