పాల్గొన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దంపతులు
విరాళంగా రూ.15లక్షల చెక్కు అందజేత
భూత్పూర్, జూన్ 6 : మండలంలోని అన్నాసాగర్ గ్రా మంలో ఆదివారం ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దంపతులు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ గ్రామంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో భక్తిశ్రద్ధలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, చైర్మన్ సత్తూర్బస్వరాజ్గౌడ్, సర్పంచ్ నీలిమ, మాజీ సర్పంచ్ బాలవర్ధన్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఖాజా, అజీజ్, ఉపసర్పంచ్ రాజారెడ్డి, జాజిలాల రాజేశ్వర్రెడ్డిపాల్గొన్నారు.
రూ.15లక్షల విరాళం
ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆలమంజుల రూ.15లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఆలవరలక్ష్మీ, ఆల శశివర్ధన్రెడ్డి, బాల్రెడ్డి, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
దేవరకద్ర రూరల్, జూన్ 6 : దేవరకద్ర మండలంలోని గద్దెగూడెం, నాగారం, గోపన్పల్లి, వెంకంపల్లి గ్రామాలలో అనారోగ్య కారణాలచేత మృతి చెందిన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పరామర్శించారు. నాగారం గ్రామానికి చెందిన శేఖర్ కుటుంబానికి నాగారం సొసైటీ నుంచి వచ్చిన రూ.లక్ష చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అండగా ఉంటామని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.