హైదరాబాద్ : ఏడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన శనివారం నగరంలోని న్యూబోయినపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఆనంద్నగర్లో చోటు చేసుకున్నది. ఆనంద్నగర్ కల్వర్టు వద్ద ఉన్న నాలా వద్ద ఉదయం అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలో కాలనీకి చెందిన ఆనంద్ సాయి (7) అనే బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని గల్లంతైన బాలుడి కోసం గాలింపు చేపట్టారు. సుమారు రెండు గంటల తర్వాత బాలుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు కళ్లెదుటే తిరిగిన బాలుడు.. రెప్పపాటులోనే నాలాలో పడి మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆనంద్ సాయి మృతితో స్థానికంగా విషాదం నెలకొన్నది.