అమరావతి : ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు మృతిపట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. వాస్తవికతను ప్రతిబింబించేలా కారా మాస్టారు రచనలు ఉండేవని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. సాహిత్య అకాడమీ అవార్డుకే ఆయన వన్నె తెచ్చారని కొనియాడారు. మాస్టారు అసంఖ్యాక అభిమానుల్లో తాను ఒకడిగా నివాళి అర్పిస్తున్నానని అన్నారు. ‘కారా మాస్టారు’గా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో ఈ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.