బంజారాహిల్స్,జూన్ 3: బంజారాహిల్స్ రోడ్ నంబర్- 1లోని తాజ్ బంజారా లేక్లో వాకింగ్ ట్రాక్ పనులు పూర్తిచేయడంతో పాటు పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డీఎంసీ సేవా నాయక్ తదితరులతో కలిసి తాజ్ బంజారా లేక్ వద్ద గురువారం పర్యటించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని, సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు.