భూపాలపల్లి టౌన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లిలో ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో శోభారాణి, ప్రగతి భవన్లో డీఆర్డీవో పురుషోత్తం, ఎన్పీడీసీఎల్ ఆఫీసులో డీఈ నాగరాజు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మందల లావణ్య, ఆర్టీసీ డిపోలో డీఎం ధరంసింగ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
గవర్నర్ తమిళి సై జన్మదిన వేడుకలు భూపాలపల్లి జిల్లా కేం ద్రంలో జరిగాయి. రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కాశెట్టి శ్రీనివాస్ కేక్ కట్చేసి స్వీట్లు పంచారు. అనంతరం రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ కిరణ్, సభ్యులు డాక్టర్ ప్రధాన్, డాక్టర్ ప్రవీణ్కుమార్, కుసుమ కృష్ణమోహన్, కో ఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ యార సుజాత, పోలీస్ స్టేషన్లో ఎస్సై మహేందర్ కుమార్, పర్లపల్లిలో జడ్పీటీసీ జోరుక సదయ్య జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సర్పంచ్ మోటె ధర్మారావు, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పున్నంచందర్రావు పాల్గొన్నారు.
మల్హర్ : రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, కొయ్యూరు పోలీస్స్టేషన్లో ఎస్సై సత్యనారాయణ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మల్హల్ రావు, సహకార సంఘ కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ చెప్యాల రామారావు జాతీయ జెండా ఎగురవేశారు. మల్లారంలో రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు.
టేకుమట్ల : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తి సంపత్గౌడ్, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహ్మద్ షరీఫొద్దీన్, పోలీస్ స్టేషన్ల్లో ఎస్సై రమణారెడ్డి, ఎంపీడీవో చండీరాణి జాతీయ జెండాలను ఎగరవేశారు. సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గునిగంటి మహేందర్గౌడ్, ప్రదాన కార్యదర్శి బిల్లకంటి ఉమేందర్రావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, టేకుమట్ల సర్పంచ్ సరోత్తంరెడ్డి, ఎంపీటీసీ సునీత పాల్గొన్నారు.
పలిమెల : మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ సాయిబాబు, మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీపీ కుర్సం బుచ్చక్క, ఐకేపీలో ఏపీఎం స్వామి, జీపీ కార్యాలయాల్లో మడే చుక్కమ్మ, జవ్వాజి పుష్పలత, అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు జాతీయ జెండా ఎగురవేశారు.
కృష్ణకాలనీ : జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర అంబేద్కర్, జయశంకర్ విగ్రహాలు, అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్వోటూ జీఎం విజయ్ ప్రసాద్, ఏజీఎం రామలింగం, డీజీఎం సత్యనారాయణ, డీవైపీఎం శివకేశవరావు, టీబీజీకేఎస్ బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, ఏఐటీయూసీ నాయకులు మోటపలుకుల రమేశ్, సెక్యూరిటీ అధికారి ఎండీ షరీఫ్ పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ శ్రీనివాసులు జాతీ య జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ సంపత్ రావు, సీఐలు శ్రీనివాస్, సైదారావు, అజయ్, వేణు, వాసుదేవరావు, ఆర్ఐలు సతీశ్, సంతోష్, చక్రవర్తి, పోలీసు అధికారుల సంఘం నేత శోభన్ తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎండీ ఇక్బాల్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆర్ఐ దేవేందర్ పాల్గొన్నారు.
రేగొండ : తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జీవాకర్రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సురేందర్గౌడ్, పోలీస్ స్టేష్టన్లో ఎస్సై కృష్ణప్రసాద్, వైద్యశాలలో వైద్యాధికారి మమతాదేవి, సహకారం సంఘం కార్యాలయంలో చైర్మన్ నడిపెల్లి విజ్జన్రావు, రేగొండ జీపీలో సర్పంచ్ ఏడునూతుల నిషిధర్రెడ్డి, టీఆర్ఎస్ కార్యాలయంలో మండలాధ్యక్షుడు మోడెం ఉమేశ్గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మైస సుమలత, నాయకులు మైస బిక్షపతి, గండి తిరుపతిగౌడ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, మండల పరిషత్ వద్ద ఎంపీడీవో ఇక్బాల్హుస్సేన్, పోలీస్ స్టేషన్లో ఎస్సై తాహెర్బాబా, సహకార సంఘం వద్ద చైర్మన్ తోట రమేశ్, జీపీ వద్ద ప్రత్యేకాధికారి శ్రీకాంత్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, కమలాపురం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, ఈదునూరి రవీందర్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఆర్ఐ కామేశ్వర్రావు, సీఈవో జగన్నాథరావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వత్సవాయి శ్రీధరవర్మ, సహకార సంఘం డైరెక్టర్లు నర్రా శ్రీధర్, సింగరబోయిన నర్సయ్య, పప్పు వెంకట్రెడ్డి, ఖుర్బాన్అలీ, ఉమేశ్రెడ్డి, నూనె లింగయ్య, సత్యనారాయణచారి, చిట్టిమల్ల సమ్మయ్య, బచ్చలకూరి ప్రసాద్, కా టూరి సుగుణ, వసురాంనాయక్, రాజమల్ల సుకుమార్, కోడం సత్యనారాయణ, భగీరథుడు, ముత్యాలరావు, రూప భద్రయ్య, సాంబయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వాణిశ్రీ, తహసీల్దార్ కార్యాలయంలో ముల్కనూరి శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్రావు, మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండారి చంద్రయ్య, మేడారంలోని ఆదివాసీ మ్యూజియం వద్ద అసిస్టెంట్ క్యూరేటర్ రవి జాతీయ జెండాను ఎగురవేశారు.
గోవిందరావుపేట : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సూడి శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవి, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురారి భిక్షపతి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎంపీటీసీలు ఆలూరి శ్రీనివాస్రావు, వెలిశాల స్వరూప, కో ఆ ప్షన్ సభ్యుడు బాబర్, సర్పంచ్ లావుడ్యా లక్ష్మీజోగ, ఉపసర్పం చ్ అల్లంనేని హన్మంతరావు, నాయకులు మురళి, వెంకన్న, చందర్రాజు, భూరెడ్డి మధు, సాంబయ్య, రాంబాబు, ప్రసాద్, మోహన్, హేమాద్రి, ప్రవీణ్, విజయ పాల్గొన్నారు.
వాజేడు : మండలంలో తెలంగాణ ఆవిర్భావ సంబురాలు నిర్వహించారు. మొరుమురు జీపీలో పంచాయతీ సిబ్బందితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లను సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అల్లం రాజ్కుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఆర్ఐ హరి మురళీకృష్ణ, పీఏసీఎస్ అధ్యక్షుడు యగ్గడి అంజయ్య, సొసైటీ సీఈవో సోమ సత్యనారాయణ, సర్పంచ్లు జెజ్జరి మేనక, పూసం నరేశ్, ఉపసర్పంచ్ కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి చిడెం నరేశ్కుమార్ పాల్గొన్నారు.
వెంకటాపురం(నూగూరు) : మండలంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థల్లో జాతీయ జెండాలను ఎగుర వేశారు. డిప్యూటీ తహసీల్దార్ రాము, జడ్పీటీసీ పాయం రమణ, ఎంపీపీ చెరుకూరి సతీశ్, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, టీఆర్ఎస్ మండల నాయకులు గంపా రాంబాబు, వేల్పూరి లక్ష్మీనారాయణ, పిల్లారసెట్టి మురళి, తోట శ్రీను, డర్రా దామోదర్, జక్కుల సమ్మయ్య, చిడెం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం : కాళేశ్వరం జీపీలో సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత, పోలీస్ స్టేషన్లో ఎస్సై బాలకృష్ణ జెండా ఎగురవేశారు. హరిత హోటల్లో మేనేజర్ జక్కం సురేశ్ జెండా ఎగుర వేశారు.
చిట్యాల : తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వై రామరావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దావు వినోద, పోలీస్స్టేషన్లో సీఐ పులి వెంకట్గౌడ్, మండల కేంద్రంలో టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పాండ్రాల స్వామి ఆధ్వర్యంలో జడ్పీటీసీ గొర్రె సాగర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలో సర్పంచ్ పూర్ణ చందర్రావు జెండా ఎగురవేశారు.
గణపురం : మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కృష్ణ చైతన్య, కేటీపీపీలో జెన్కో సీఈ సిద్ధయ్య, డీటీవో కార్యాలయంలో ఎంవీఐ శ్రీనివాస్, ఎంపీడీవో అరుంధతి, ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, టీఆర్ఎస్ కార్యాలయంలో సర్పంచ్లు జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోతర్ల అశోక్యాదవ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతిగౌడ్, నాయకులు పొలుసాని లక్ష్మీనరసింహారావు, కర్ణాకర్రెడ్డి, మార్త సుధాకర్, బోయిని సాంబయ్య పాల్గొన్నారు.
కాటారం : గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తోట రాధమ్మ, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సునీత, సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ కిషన్, సీఐ హథీరాం, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ ఆంకారి భవానీప్రకాశ్, పీహెచ్సీలో వైద్యుడు రామారావు, టీఆర్ఎస్ కార్యాలయంలో అధ్యక్షుడు డోలి అర్జయ్య జాతీయ పతాకాలను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మ హేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, రవి, రాజమణి, ఎస్సై సాంబమూర్తి, ఎంపీడీవో శంకర్, ఎంపీవో మల్లికార్జున్ రెడ్డి, ఏపీవో లవకుమార్ పాల్గొన్నారు.
వెంకటాపూర్ : తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కర్నాటి శ్రీధర్, పోలీస్ స్టేషన్లో ఎస్సై రమేశ్ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు డోలి రజిత, మెడబోయిన అశోక్, మేకల మహేందర్, మందల సుచరిత, బొజ్జ జగన్ మోహన్రావు, గట్టు కుమారస్వామి, శ్రీరంజని, రాజిరెడ్డి, జయలక్ష్మి, భద్రయ్య, సారంగం, రమ పాల్గొన్నారు.
మహాముత్తారం : మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మార్క రాముగౌడ్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించా రు. పీఏసీఎస్ చైర్మన్ సోమ శాంతకుమార్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు మందల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మ న్ రాధారపు స్వామి, సర్పంచ్ మందల లత, మాజీ ఎంపీపీ మెండ వెంకటస్వామి, ఉప సర్పంచ్ మధుకర్ పాల్గొన్నారు.
మహదేవపూర్ : మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బన్సోడ రాణీబాయి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ శ్రీపతిబాపు, పీవో, సీడీపీవో కార్యాలయంలో సీడీపీవో రాధిక జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎంపీడీవో కృష్ణవేణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్రావు, యూత్ మండలాధ్యక్షుడు అలీంఖాన్ పాల్గొన్నారు.కన్నాయిగూడెం : మండలంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ దేవాసింగ్, ఎంపీపీ సమ్మక్క పాల్గొన్నారు.