ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో నక్సల్కు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నక్సల్ ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి గాయాలయ్యాయి. కేష్కల్ బ్లాక్ పరిధిలోని కున్మారి అడవి ప్రాంతంలో నక్సల్స్ కోసం పారామిలిటరీ దళాలు మంగళవారం మధ్యాహ్నం కూంబింగ్ చేపట్టాయి. పోలీసులు తారసపడటంతో నక్సల్స్ కాల్పులు ప్రారంభించారు.
కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా..మరికొందరు గాయపడినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని కొండగావ్ ఎస్పీ సిద్ధార్థ్ తివారీ పేర్కొన్నారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సుమారు గంటకుపైగా నక్సల్స్కు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలం నుంచి చాలామంది నక్సల్స్ తప్పించుకున్నట్లు తెలిసింది. ఇదే ప్రాంతంలో ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న 17 వాహనాలను రెండు నెలల క్రితం నక్సల్స్ దగ్ధం చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.