చిన్నారి చికిత్సకు సాయం

మందమర్రి : ‘మేము సైతం’ స్వచ్ఛంద సంస్థ దాతల నుంచి సేకరిం చిన రూ.30వేల చెక్కును మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ వర్షశ్రీ తల్లిదండ్రులకు అందించారు. మంగళవారం మందమర్రి జీఎం కార్యాలయంలో మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నూరులోని జెండావాడకు చెందిన ఒద్ది నరేశ్-స్నేహల మూడేళ్ల కూతురు వర్షశ్రీకి రక్తంలో ఇన్ఫెక్షన్ సోకి ఊపి రితిత్తుల్లో నీరు చేరడం వల్ల మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని రేయిన్బో దవాఖానకు పంపించారు. నరేశ్ది పేద కుటుంబం. దీంతో ‘మేము సైతం’ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు దాతల నుంచి రూ. 30 వేలు సేకరించి జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా వర్షశ్రీ తల్లి దండ్రులకు చెక్కును అందించారు. సభ్యులను జీఎం అభినందిం చా రు. సభ్యులు పత్తిపాక శ్రీనివాస్, బిరుదు సత్యం, ఈర్లపాటి సోమ య్య, జక్కని సత్యనారాయణ, చంద్రకాంత్, వడ్ల రవి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇమ్మిగ్రేషన్ సంస్కరణలను స్వాగతించిన టెక్ కంపెనీలు
- బైడెన్ వచ్చిన వేళ చైనా కొత్త వాదన
- ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో ఇన్ని బెనిఫిట్సా..!
- మరో ఆసుపత్రికి శశికళ తరలింపు
- స్టార్ హీరో చిత్రంలో ' గ్యాంగ్ లీడర్' హీరోయిన్..!
- 31 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మూడో దశ పరీక్షలు
- హైదరాబాద్లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన
- రా రమ్మంటాయి..ఆనందాన్నిస్తాయి
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్కు బెదిరింపు కాల్స్..!