బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంతో అందరి దృష్టి ఆకర్షించిన ముద్దుగుమ్మ దివి. రీసెంట్గా ఈ అమ్మడు క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోకపోయిన దివి నటనకు మంచి పేరు వచ్చింది. అయితే బిగ్ బాస్ నుండి దివికి అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగగా, తాజాగా ఆమెని హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020(టీవీ)గా నిర్ణయించారు. దివికి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ హీరోగా తెరకెక్కిన మహర్షి చిత్రంలో దివి చిన్న పాత్ర పోషించింది. ఆ పాత్రతో ప్రేక్షకులకి పెద్దగా దగ్గర కాకపోయినప్పటికీ, బిగ్ బాస్ షో ఈ అమ్మడిని యువతకు బాగా దగ్గర చేసింది. దివికి సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా కూడా ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తుంటారు. కాగా, 2019కు గాను సమంత హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్గా నిలిచిన విషయం తెలిసిందే.