మక్తల్ టౌన్, మే 28 : అందరూ వాక్సిన్ను ఉపయోగించుకోవాలని డాక్టర్ సిద్ధప్ప అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడి యా రిపోర్టర్లు, ఫర్టిలైజర్ షాపు సభ్యులకు, రేషన్ డీలర్లకు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధప్ప మాట్లాడుతూ మూడు రోజులపాటు కొవిడ్ వాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. 70 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపా రు. కార్యక్రమంలో శివశంకర్, విజయ్కుమార్, సురేంద ర్, రఘు, అశోక్, చిన్న, నర్సింహులు, శీను, నవీన్, రాము లు, కృష్ణయ్య పాల్గొన్నారు.
సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్
నారాయణపేట రూరల్, మే 28 : పట్టణంలోని జిల్లా దవాఖానతోపాటు మండలంలోని కోటకొండ పీహెచ్సీలో శుక్రవారం సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ చేశారు. రేషన్డీలర్లు, వ్యవసాయశాఖ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీ డియా జర్నలిస్టులు ఆయా కేంద్రాల్లో టీకాలు వేసుకొన్నా రు. శనివారం ఆయా కేంద్రాల్లో టీకాల పంపిణీ కార్యక్ర మం కొనసాగనున్నది.
కరోనా టీకా ప్రారంభం
దామరగిద్ద, మే 28: మండలంలోని ప్రజలకు కరోనా మొదటి డోసు టీకా కార్యక్రమాన్ని శుక్రవారం మండల ద వాఖానలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ బుధవారం నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభించామని, పై అధికారుల ఆదేశాల మేర కు మొదటి డోసు శుక్రవారం ప్రారంభించి దాదాపు 30 మందికి వేశామని, అర్హులైన వారందరూ వచ్చి కరోనా టీకా వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ వెంకట్రామరెడ్డి, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ ప్రారంభం
ఊట్కూర్, మే 28 : సూపర్స్ప్రెడర్ల్లకు వ్యాక్సినేషన్ను స ద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి గోవిందరాజన్, ఎంపీడీవో కాళప్ప అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో గుర్తించిన సూపర్ స్ప్రెడర్లకు టీకా ప్రక్రియను ఊట్కూర్ పీహెచ్సీలో అధికారులు ప్రా రంభించారు. మండలంలో వివిధ రంగాలకు చెందిన 85 మందిని గుర్తించామన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ సం బంధిత పీహెచ్సీలో ఉచిత టీకాను వేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యుడు శ్రీకాంత్రెడ్డి, సూపర్వైజర్ మణిమాల, ఎంపీహెచ్ఈవో హేమలాల్, ఏఎన్ఎం శైలజ, ఆరోగ్యమిత్ర సురేశ్ పాల్గొన్నారు.