లెక్కల మాస్టారు సుకుమార్ సినిమాలు చూస్తే ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ని కలిగిస్తుంటుంది. ఇప్పుడు ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండగా, శిష్యులు యువ హీరోలతో మంచి కథాంశం ఉన్న చిత్రాలని రూపొందిస్తున్నారు. మొన్నామధ్య సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో ఉప్పెన అనే చిత్రం చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.
ఇక ఇప్పుడు సుకుమార్ మరో శిష్యుడు కార్తీక్ దండు త్వరలో మెగా ఫోన్ పట్టనున్నారట. సాయి తేజ్ హీరోగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఈ మూవీని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కథానాయికగా కృతి శెట్టిని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఉప్పెన సినిమాతో వరుస ఆఫర్స్ అందుకుంటున్న కృతి ఇప్పుడు సాయి తేజ్ సరసన నటించే ఆఫర్ అందుకోవడం విశేషం. కృతి ప్రస్తుతం లింగుస్వామి- రామ్ సినిమాతో పాటు నాని ‘శ్యామ్ సింగ రాయ్’,సుధీర్ బాబు – ఇంద్రగంటి చిత్రాలు చేస్తుంది.