టోక్యో : సముద్ర పరిశోధనలో జపాన్ అతిపెద్ద విజయం సాధించింది. సముద్రంలో అరుదైన ఖనిజాన్ని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త ఆవిష్కరణ 500 సంవత్సరాలకు సరిపడా అవసరాలను తీర్చగలదని నమ్ముతున్నారు. దీంతో ఇకపై చైనాపై ఆధారపడే అవకాశాలు ముగిసిపోతాయని జపాన్ సంబురపడిపోతున్నది.
జపాన్ పరిశోధనా నౌక కైమి 8023 మీటర్ల సముద్ర లోతును తాకి కొత్త రికార్డును సృష్టించింది. ఈ నౌక టెక్టోనిక్స్ ప్లేట్ , పెద్ద భూకంపాల కారణాలను పరిశీలిస్తున్నది. సముద్రంలో 6 వేల కిలోమీటర్ల లోతులో లభించే అరుదైన ఖనిజాలను తీయడం ఈ నైక కౌమీ ప్రధాన లక్ష్యంగా ప్రయోగాలు మొదలుపెట్టారు. జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్-ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు.. ఒగాసవరా ద్వీపం ఉన్న మహాసముద్రంలో అరుదైన ఖనిజాలు, యట్రియంలను కనుగొన్నారు. దాదాపు 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వీటిని గుర్తించారు.
వీటిలో 16 మిలియన్ టన్నుల అరుదైన ఆక్సైడ్, 780 సంవత్సరాల దేశీయ అవసరాలకు సరిపడా యట్రియం, 620 సంవత్సరాలకు కావాల్సిన యూరోపియం, 420 సంవత్సరాలకు అవసరమైన టెర్బియం, 730 సంవత్సరాలకు సరిపడా డైస్ప్రోసియం లభించాయి. ఈ అరుదైన లోహాలు టెక్నాలజీ, రక్షణ, అణు రంగం పరిశోధనలు, అభివృద్ధిలో చాలా ముఖ్యమైనవని అక్కడి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తద్వారా అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడటం తొలగిపోనున్నదని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. దౌత్య వివాదం తర్వాత అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయడాన్ని చైనా నిషేధించింది. ప్రస్తుతం జపాన్లో దిగుమతి చేసుకున్న అరుదైన లోహాలలో చైనా వాటా 58 శాతంగా ఉన్నది.
2000 లో చైనా-జపాన్ మధ్య తూర్పు చైనా సముద్రంలోని ద్వీపాలపై వివాదాలు చెలరేగినప్పుడు, జపాన్కు విక్రయించే అరుదైన ఖనిజాల ఎగుమతిని నిషేధించిందని టోక్యోలోని అంతర్జాతీయ క్రిస్టియన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల అసోసియేట్ ప్రొఫెసర్ స్టీఫెన్ నేగి తెలిపారు. దాంతో అప్పటి నుంచి జపాన్ ఈ కొత్త వనరుల కోసం వెతకడం ప్రారంభించింది.
7 ఏండ్లలో మోదీ 7 నిర్ణయాలు.. ప్రతి భారతీయుడిపై ప్రభావం
భారత ప్రధానిగా మోదీ ప్రమాణం.. చరిత్రలో ఈరోజు
అరటితో ఏమేం పోషకాలు అందుతాయంటే..?
ఆఫ్ఘనిస్తాన్లో విస్తరిస్తున్న తాలిబాన్.. మూడు జిల్లాలు స్వాధీనం
మయన్మార్లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..