దాతలు ముందుకురావాలి
గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కరోనా బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
తొర్రూరు/పెద్దవంగర, మే 20 : ఆపత్కాలంలో ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు అండగా నిలుద్దామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన తొర్రూరు డివిజన్ కేంద్రంలోని సాయినగర్లో అమెరికాలో స్థిరపడిన సీ దినేశ్ బైలుపాటి, పెద్ద ముత్తయ్య సహకారంతో ఆలిండియా బేడ బుడగ జంగాల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు తూర్పాటి పాండు ఆధ్వర్యంలో 200మంది కొవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. పెద్దవంగర మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాల్లో ప్రజలకు పంపిణీ చేసేందుకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు మాస్కులు అందజేశారు.
ఆయా కార్యక్రమాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కొవిడ్ కష్టకాలంలో స్వ చ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. లాక్డౌన్తో రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోకి వస్తున్నదన్నారు. గ్రామప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఎవరూ ఇండ్లు విడిచి బయటికి రావొద్దన్నారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్పీ వెంకటనారాయణ,తొర్రూరు మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, టీఆర్ఎస్ పెద్దవంగర మండల అధ్యక్షుడు ఐలయ్య, మండల ప్రధాన కార్యదర్శి సంజయ్, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, తహసీల్దార్ యోగేశ్వర్రావు, ఎంపీడీవో శేషాద్రి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఏపీఎం వీరయ్య, టీఆర్ఎస్ నాయకులు బిందు శ్రీనివాస్, నీలేశ్ పాల్గొన్నారు.