లండన్: చైనా పీపుల్స్ బ్యాంక్ హెచ్చరికలు.. టెస్లా సీీీీీీీీీీీీీీీీీీీీీీీీఈఓ ఎలన్ మస్క్ వ్యాఖ్యలు బిట్ కాయిన్ కొంప ముంచాయి. శరవేగంగా లక్ష కోట్ల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. గాలి బుడగలా టప్ మని పడిపోయింది. 500 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది. బిట్ కాయిన్ విలువ సుమారు 30 శాతం నష్టపోయి 31 వేల డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
తమ కార్ల కొనుగోళ్లకు బిట్ కాయిన్లను అనుమతిస్తామని గత ఫిబ్రవరి ఎనిమిదో తేదీన చేసిన ప్రకటనపై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మాట మార్చారు. ఫలితంగా బిట్ కాయిన్తో సహా అన్ని క్రిప్టో కరెన్సీలు పతనమయ్యాయి. ఎథిరియం 40 శాతానికి పైగా, డోజ్ కాయిన్ 45 శాతం నష్టపోయాయి.
గత నెలలో 64,870 డాలర్లకు చేరువైన బిట్ కాయిన్ ఇప్పుడు 50 శాతానికి పైగా నష్టపోయి నేల చూపులు చూస్తున్నది. క్రయ, విక్రయాల్లో డిజిటల్ కరెన్సీల వాడకంపై నిషేధం కొనసాగుతుందని చైనా పీపుల్స్ బ్యాంక్ పునరుద్ఘాటించింది.
ఇంతకుముందు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై ఫెడరల్ రిజర్వు నిర్ణయాలు వెల్లడించినప్పుడూ బిట్ కాయిన్ పతనమైంది. క్రిప్టో కరెన్సీలకు ముకుతాడు వేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వాటిల్లో పెట్టుబడులపై పన్ను పెంచారు. అప్పుడూ బిట్ కాయిన్ భారీగానే పతనమైంది.
తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసు.. విచారణ మే 21కి వాయిదా..!
ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!
క్రిప్టోకరెన్సీకి ట్విట్టర్ సీఈఓ వెన్నుదన్ను
తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?
కుటుంబాలకు ‘జంట’ సవాళ్లు.. పెరిగిన ఇంధన, హెల్త్కేర్ ఖర్చు!!
క్రిప్టో బిజినెస్పై డ్రాగన్ నిషేధం! ఎలాగంటే!!
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్..