న్యూఢిల్లీ : ఐటీ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్ లో వేయికి పైగా టెకీల నియామకానికి ప్రణాళికలు రూపొందించామని స్విస్ బ్యాంక్ దిగ్గజం క్రెడిట్ సూస్ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్, ఏపీఐ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి టెక్నాలజీల్లో డెవలపర్లు, ఇంజనీర్లను నియమించుకుంటామని తెలిపింది.
బ్యాంక్ అంతర్జాతీయ సేవలకు టెక్నాలజీ కేంద్రంగా భారత్ లో తన ఉనికిని విస్తరించేందుకు క్రెడిట్ సూస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నియామకాలను చేపడుతున్నామని బ్యాంక్ తెలిపింది. భారత్ లో అందుబాటులో ఉన్న నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటికే 2000 మంది ఐటీ ఉద్యోగులను నియమించుకున్నామని వెల్లడించింది.