న్యూఢిల్లీ: దేశీయ ఆతిథ్య రంగంపై కొవిడ్-19 మహమ్మారి తీవ్రంగానే ప్రభావం చూపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.30 లక్షల కోట్ల మేరకు దేశీయ హోటళ్లు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి భారత్ హోటళ్లు, రెస్టారెంట్ సంఘాల సమాఖ్య (ఎఫ్హెచ్ఆర్ఏఐ) విజ్ఞప్తి చేసింది. ఆర్థిక పరమైన చర్యలు ప్రకటించి తమను ఆదుకోవాలని కోరింది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతీయ హోటల్ పరిశ్రమ ఆదాయం (రెవెన్యూ) రూ.1.82 లక్షల కోట్లు. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం 2020-21లో కరోనాను నియంత్రించడానికి కేంద్రం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్తోపాటు ఇతర ఆంక్షలు అమలులో ఉండటం వల్ల దేశంలోని హోటళ్లు, రెస్టారెంట్లు 75 శాతం రెవెన్యూ కోల్పోయాయి.
2019-20 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం గతేడాది రూ.1.30 లక్షల కోట్ల మేరకు హోటళ్ల రెవెన్యూ పడిపోయింది. పలు హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు తీసుకున్న రుణాలు మొండి బాకీలుగా మారాయి. ఫలితంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడ్డాయి.
2020 మార్చిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ విధించినప్పటి నుంచి హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణకు పలు కష్టాలు పడాల్సి వస్తుందని ఎఫ్హెచ్ఆర్ఏఐ ఉపాధ్యక్షుడు గుర్బక్ష్ సింగ్ కోహ్లీ తెలిపారు. తాజా పరిస్థితుల్లో వడ్డీతోపాటు రుణ వాయిదాల చెల్లింపులు కష్టంగా పరిణమించాయన్నారు. రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం విధించకపోతే హోటళ్ల రంగం పూర్తిగా ధ్వంసమవుతుందని చెప్పారు.
ఆస్తి పన్ను, ఎలక్ట్రిక్ చార్జీలు, వాటర్ బిల్లులు, ఎక్సైజ్ లైసెన్స్ ఫీజులు రద్దు చేయాలని ఎఫ్హెచ్ఆర్ఏఐ సంయుక్త కార్యదర్శి ప్రదీప్ శెట్టి ప్రభుత్వాన్ని కోరారు. తమ వ్యాపార లావాదేవీలు పునః ప్రారంభించడానికి తక్కువ వడ్డీరేటుపై రుణ పరపతి కల్పించాలని అభ్యర్థించారు.
ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు!
Amazon miniTV: అమెజాన్ మినీ టీవీ లాంచ్.. పూర్తిగా ఉచితం
మౌత్వాష్ ఆర్డర్ చేస్తే.. స్మార్ట్ఫోన్ వచ్చింది!
బ్రిటన్ వైపు ఇండియన్ సంపన్నుల చూపు.. నిపుణులు కూడా..!
Corona టైం..పరిమళించిన మానవత్వం: అంబులెన్స్ డ్రైవర్గా ఎన్నారై
ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ ఎఫ్డీ కన్నా బెటర్
పరపతికి గీటురాయి సిబిల్ స్కోర్
సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!
బంగారం vs క్రిప్టో కరెన్సీ.. పెట్టుబడికి ఏది బెస్ట్? గోల్డ్కే ఇండియన్ల మొగ్గు!!
అక్షయ తృతీయకు డిమాండ్ లేకున్నా.. పెరిగిన బంగారం దిగుమతులు
ఎయిరిండియా ప్రైవేటీకరణ ఈ ఏడాది డౌటే!