Mancherial
- Nov 10, 2020 , 02:31:24
రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టాలి

- మంత్రి తలసానికి విన్నవించిన యాదవ మహాసభ నాయకులు
మందమర్రి : రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టాలని అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండి సదానందం యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కోరారు. హైదరాబాద్లో సోమవారం మంత్రిని కలిసిన నాయకులు వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలో యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. యాదవ సంఘాల భవన నిర్మాణాలను, గొర్రెలు, మేకల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని సదానందం తెలిపారు. మంత్రికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సతీశ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లంల నాగన్న యాదవ్, నాయకులు మాచర్ల గట్టయ్య, పలుమారు అంజయ్య యాదవ్, బండి శివకుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభించిన మంత్రి
- యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం
- గంగూలీకి మళ్లీ ఛాతీలో నొప్పి
- కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
- ఐపీఎల్-2021 మినీ వేలం తేదీ, వేదిక ఖరారు
- థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ
- ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు దాటిన కోవిడ్ కేసులు
- నదిలో పడవ మునిగి నలుగురు మృతి
- యూకే వైరస్పై సమర్థంగా పని చేస్తున్న కొవాగ్జిన్
MOST READ
TRENDING