సిద్దిపేట జోన్, మే 06 : సిద్దిపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నేడు జరుగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కొత్త పాలకవర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల అధికారి, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ కౌన్సిలర్లతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం 3.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల అధికారి నోటిఫికేషన్ జారీచేస్తారు. దీని ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులు ఉండగా, అందులో 36 టీఆర్ఎస్, ఐదుగురు స్వతంత్రులు, ఒకరు ఎంఐఎం, ఒకరు బీజేపీ నుంచి గెలుపొందారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు టీఆర్ఎస్కే దక్కనున్నాయి. మొదట ఎన్నికల అధికారి గెలుపొందిన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకరం చేయిస్తారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. చైర్మన్ పదవిని మహిళకు రిజర్వ్ చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు టీఆర్ఎస్ అధిష్టానం, మంత్రి హరీశ్రావు సూచించిన వ్యక్తులకే దక్కనున్నాయి. ఈ ఎన్నికను పర్యవేక్షలుగా టీఆర్ఎస్ అధిష్టానం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ను నియమించింది. పార్టీ సూచించిన వ్యక్తికే టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.