జోగులాంబ గద్వాల : మైనర్ బాలికకు వివాహం చేస్తుండగా విషయం తెలుసుకున్న శాంతి నగర్ పోలీసులు అక్కడికి చేరుకొని వివాహాన్ని నిలుపుదల చేసిన సంఘటన జిల్లాలోని వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రామాపురం గ్రామానికి చెందిన ఓ బాలికకు(16) ఇదే మండలానికి చెందిన తనగల గ్రామానికి చెందిన అబ్బాయికి ఈ రోజు ఉదయం 4 గంటలకి తనగల గ్రామంలో వివాహం నిశ్చయించారు.
సమాచారం అందుకున్న శాంతినగర్ పోలీసులు వివాహాన్ని అర్ధరాత్రి నిలిపివేసి బాలికను సీడీపీవో సుజాతకు అప్పగించారు. ఎవరైనా బాల్య వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనంతరం బాలికను సీడీపీవో గద్వాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం