కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విజయం దిశగా దూసుకుపోతున్నది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా ఫలితాల నాటికి 200కుపైగా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఒబ్రెయిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. బెంగాల్లో బీజేపీ 200 స్థానాలు గెలుస్తుందన్న ఆయన ప్రసంగం క్లిప్ను ఎమోజీలతో ట్విట్టర్లో షేర్ చేశారు. పశ్చిమ బెంగాల్లో విజయం కోసం ప్రధాని మోదీ, అమిత్ షా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని పరోక్షంగా విమర్శించారు.