అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్ర టీజర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ జన్మదినోత్సవం రోజున విడుదల చేసిన టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. తెలుగు చిత్రసీమలో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ను దక్కించుకున్న తొలి టీజర్గా ‘పుష్ప’ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు సినిమాలో అరుదైన రికార్డు ఇదని చిత్రబృందం పేర్కొంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరస్లో కుబా, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుకుమార్.