నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 26: రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాలకు చెందిన పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఖాళీలు ఏర్పడిన సర్పంచ్, వార్డుమెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎంపీడీవోలు మల్లేశ్, ఎక్బాల్ ప్రీసైడింగ్ అధికారులకు శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీవో మధురిమ పాల్గొన్నారు.
ధర్పల్లిలో..
ధర్పల్లి, ఏప్రిల్ 26: మండలంలోని డీబీ తండాలో ఖాళీగా ఉ న్న వార్డు సభ్యుల స్థానికి సంబంధించి త్వరలో నిర్వహించను న్న ఎన్నికలకుగాను సిబ్బందికి అవగాహన కల్పించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ స్టేజీ-2 అధికారి మండల పరిషత్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను సిబ్బందికి వివరించారు.
ఇందల్వాయిలో..
ఇందల్వాయి, ఏప్రిల్ 26: మండలంలోని తిర్మన్పల్లి, గంగారాం తండా గ్రామాల్లో నిర్వహించే పంచాయతీ ఎన్నికలపై ప్రిసైడింగ్ అధికారులకు ఎంపీడీవో రాములునాయక్ మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, నామినేషన్ల స్వీకరణ కొవిడ్ నిబంధనల అమలు తదితర అంశాలను వివరించారు.
వర్నిలో..
వర్ని, ఏప్రిల్ 26: మండలంలోని అంతాపూర్ తండాలో ఖాళీగా ఉన్న స్థానానికి త్వరలో నిర్వహించనున్న వార్డు సభ్యుడి ఎన్నిక సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించామని ఎంపీడీవో బషీరుద్దీన్ వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీవో చందర్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.