మల్లాపూర్, ఏప్రిల్ 23 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేటర్ ప్రభుదాస్తో కలిసి మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లోని ప్రధాన రహదారుల్లో ప్రభుత్వం అందించిన సోడియం హైపో క్లోరైట్ పిచికారీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న టీకాలను తప్పకుండా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్రెడ్డి, గరిక సుధాకర్, కిరణ్కుమార్రెడ్డి, బాలరాజు, నవీన్గౌడ్, సాయికుమార్, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.