హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణకు ఫేస్మాస్కులు ధరించడం తప్పనిసరైన నేపథ్యంలో మరింత మెరుగైన రక్షణ కల్పించే మాస్కులను హిమాచల్ప్రదేశ్లోని ఐఐటీ మండి పరిశోధక బృందం తయారుచేస్తున్నది. స్వతహాగా శుభ్రం చేసుకొనే యాంటి బ్యాక్టీరియ ల్ మాస్కును, పీపీఈ పరికరాలను ఆవిష్కరించింది. ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్ఠాత్మక అమెరికన్ కెమికల్ సొసైటీ ఐప్లెడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ఫేస్ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఐఐటీ మండి స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ జైస్వాల్ నేతృత్వంలో ప్రవీణ్, షౌనక్రాయ్, అంకితా సర్కారు పరిశోధనలు సాగించారు. యాంటీ మైక్రోబియల్ పూత పూయడం ద్వా రా ఇప్పటికే ఉన్న పీపీఈ కిట్లను, ఫేస్మాస్కులను సూక్ష్మక్రిమి రహితంగా తీర్చిదిద్దారు. అదీగాక నాలుగు పొరలు కలిగిన పాలికాటన్ ఫాబ్రిక్ను తయారుచేశారు. ఈ మాస్కుకు యాంటీమైక్రోబియల్ లక్షణాలను అందించడానికి వెంట్రుక పరిమాణంలో లక్షోవంతు చిన్నవిగా ఉండే మాలిబ్డినం సల్ఫైడ్, మోస్-2 పదార్థాలను వినియోగించారు.
అవి పదునైన అంచులు, నానోమీటర్ పరిమాణపు పలకలను కలిగి ఉండి బ్యాక్టీరియా, వైరస్లను పట్టిఉంచడంతోపాటు సంహరించడంలో చిన్నకత్తులుగా పనిచేస్తాయి. ఇక మాలిబ్డినం సల్ఫైడ్ నానోషీట్లు కాంతికి గురైనప్పుడు క్రిమిసంహారక చర్యలను ప్రారంభిస్తాయి. ఇది సూర్యకాంతిని గ్రహించి దానిని వేడిగా మార్చుతుంది తద్వారా సూక్ష్మజీవులను చంపుతుంది. 60 సార్లు ఈ మాస్కులను ఉతికిన తర్వాత కూడా యాంటీబ్యాక్టీరియల్ చర్యలను ప్రదర్శిస్తాయని ప్రధాన పరిశోధకు డాక్టర్ జైస్వాల్ తెలిపారు. ఇలా సౌరవికిర ణం జరిగిన ఐదు నిమిషాల్లోనే ఈ కోలి, ఎస్, ఆరియస్ తదితర సూ క్ష్మక్రిములను 100 శాతం చంపినట్టు పేర్కొన్నారు. ఈ మాస్కులను సూర్యకాంతిలో ఎండబెట్టడం వల్ల స్వతహాగా శుభ్రం చేసుకుంటాయని తెలిపారు. కొవిడ్ వైరస్ (120 నానోమీటర్లు) పరిమాణంలో ఉన్న 96 శాతం కణాలను కూడా వడపోస్తాయని, శ్వాసను అందించడంలో ఎలాంటి అవరోధాలు ఉండవని పేర్కొన్నారు.