ముంబై: ఒలింపిక్స్లో క్రికెట్కు ఇన్నాళ్లూ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ నో చెబుతూ వస్తోంది. కారణం.. తాము ఎక్కడ స్వతంత్రత కోల్పోతామో.. ఇండియన్ ఒలింపిక్ కమిటీకి ఎక్కడ జవాబుదారీగా ఉండాల్సి వస్తుందో అన్న ఆందోళన. కానీ ఇప్పుడు బోర్డు తీరులో మార్పు కనిపిస్తోంది. తాజాగా ఒలింపిక్స్లో క్రికెట్కు బీసీసీఐ సానుకూలంగా స్పందించడం విశేషం.
చివరిసారి 1900లో జరిగిన ఒలింపిక్స్లో క్రికెట్ కూడా ఉంది. ఆ తర్వాత ఈ మెగా స్పోర్టింగ్ ఈవెంట్లో జెంటిల్మన్ గేమ్కు చాన్స్ దక్కలేదు. 2028లో లాస్ ఏంజిల్స్లో జరగబోయే ఒలింపిక్స్లో క్రికెట్ కోసం ఐసీసీ ప్రయత్నిస్తోంది. అయితే దీనికి ఇన్నాళ్లూ బీసీసీఐ అడ్డు చెబుతూ వచ్చింది.
కానీ తాజాగా ఐసీసీతో జరిగిన సమావేశంలో బీసీసీఐ మెత్తబడింది. ఒలింపిక్స్లో క్రికెట్ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు బోర్డు కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ చెప్పారు. మాకు ఆసక్తిగానే ఉంది. అయితే దీనికి సంబంధించిన విధివిధానాల దిశగా పని చేయాల్సి ఉంది అని ధుమాల్ చెప్పారు. అంతేకాదు ఇప్పటికే వచ్చే ఏడాది జరగబోయే కామన్వెల్త్ గేమ్స్కు మహిళల టీమ్ను పంపడానికి కూడా బోర్డు అంగీకరించింది.
ఇవి కూడా చదవండి
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
IPL 2021: ఇలాంటి ప్లేయర్స్ను తీసుకున్న టీమ్ ఓడిపోవాల్సిందే!
హాస్పిటల్లో చేర్చుకోలేదని కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య
రాహుల్కు గర్ల్ఫ్రెండ్ అతియా చెప్పిన విషెస్ చూశారా?
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి: నీతి ఆయోగ్ వీసీ
గాలి ద్వారానే కరోనా.. ఎన్95 లేదా కేఎన్95 మాస్కులే వాడండి
IPL 2021: సన్రైజర్స్కు మరో షాక్.. స్టార్ బౌలర్కు గాయం
భారత వ్యవసాయ చట్టాలను వెనకేసుకొచ్చిన కెనడా నేత
IPL 2021: స్పెషల్ జెర్సీతో బెన్ స్టోక్స్కు రాయల్స్ వీడ్కోలు.. వీడియో
నావాల్నీ ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు: డాక్టర్లు
IPL 2021: ధోనీ రికార్డు బద్ధలుకొట్టిన రోహిత్ శర్మ