అల్మాటీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో సరితా మోర్ స్వర్ణంతో మెరిసింది. మహిళల 59కిలోల ఫైనల్ బౌట్లో సరిత 10-7 తేడా తో షావోదర్(మంగోలియా)పై అద్భుత విజయం సాధించింది. 1-7తో వెనుకంజలో ఉన్న స్థితి నుంచి అనూహ్యంగా పుంజుకున్న సరిత ప్రత్యర్థిని మట్టికరిపించింది. మంగోలియా రెజ్లర్ను ఉడుంపట్టి పట్టిన వరుస పాయింట్లతో బౌట్ను తన వశం చేసుకుని వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. మరోవైపు సీమా బిస్లా(50కి), పూజ(76కి) ఓటమిపాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.