ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో మరో కొత్త సినిమా రాబోతోంది. ఈ 16న అంటే శుక్రవారం రోజున తెల్లవారితే గురువారం సినిమా ప్రీమియర్ ని ఎనౌన్స్ చేసింది. మణికంఠ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీరవాణి కొడుకు శ్రీ సింహా, చిత్రశుక్లా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించాడు. ఇప్పుడీ సినిమా 20 రోజలకే ఆహాలో రావడం విశేషం.
మరోవైపు కార్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా సినిమా కూడా ఆహాలో రాబోతోంది. ఏప్రిల్ 23న ఈ సినిమా అందబాటులో ఉంటుందని ప్రకటించింది. 19 మార్చిన థియేటర్ లో విడుదలైన ఈసినిమా నిరాశపర్చింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం.