డీఎంహెచ్ఓ కోటాచలం
పెన్పహాడ్, ఏప్రిల్ 6 : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్ఓ కోటాచలం కోరారు. మండల కేంద్రంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సిబ్బందికి నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. కొవిడ్ వ్యాక్సిన్ను అందరూ తీసుకునేలా ఆయా గ్రామాల్లోని ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. వ్యాక్సిన్తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ప్రతి రెండు గ్రామాలకు కలిపి కనీసం 150 కొవిడ్ పరీక్షలు చేయాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, డాక్టర్ సునీత, హెచ్ఈఓ భువనేశ్వర్రెడ్డి, సూపర్వైజర్ శ్రీలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
40 మందికి కొవిడ్ వ్యాక్సిన్
నాగారం, ఏప్రిల్ 6 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 40 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ గాదరి రామకృష్ణ తెలిపారు. మంగళవారం పీహెచ్సీలో 46 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది ప్రవీణ్రెడ్డి, కవిత, పార్వతి, శోభ, యాదగిరి, యల్లమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
అర్వపల్లి : కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ నవీన్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో 45 సంవత్సరాలు దాటిన 20 మందికి మంగళవారం కరోనా టీకా వేసినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో కరోనా పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట సీహెచ్ఓ చరణ్నాయక్, కాసర్లపహాడ్ సర్పంచ్ జ్యోతిరాణి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.