ముంబై: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశాడు.
ముంబైలోని టీమ్ హోటల్కు శనివారం వచ్చాడు. కరోనా నేపథ్యంలో వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉంటాడు. 31ఏండ్ల స్మిత్ను రాజస్థాన్ రాయల్స్ విడిచిపెట్టడంతో ఫిబ్రవరిలో జరిగిన వేలంలో స్మిత్ను ఢిల్లీ 2.2కోట్లకు కొనుగోలు చేసింది.
ఒకే ఫ్రేమ్లో రెండు 2 దిగ్గజ చిహ్నాలు, ఢిల్లీ ఫ్యామిలీకి స్వాగతం అంటూ ట్వీట్ చేసిన ఫ్రాంఛైజీ స్మిత్ సెల్ఫీ ఫొటోను షేర్ చేసింది.
ఢిల్లీ ఫ్రాంఛైజీ ఇప్పటికే ట్రైనింగ్ను కూడా ప్రారంభించింది. స్మిత్తో పాటు స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టాయినీస్ కూడా క్వారంటైన్ పూర్తైన తర్వాత జట్టుతో కలిసి సాధన చేస్తారు.
గతేడాది కెప్టెన్గా, బ్యాట్స్మన్గా విఫలమైన స్మిత్ ఈ సీజన్లో ఏమేరకు రాణిస్తాడో చూడాలి.