ఉప్పల్, ఏప్రిల్ 1: అమ్మ చీరెతో ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి ఊయల కట్టింది. ఆనందంగా ఊగుదామని ఆ చిన్నారి భావించింది. కొద్దిసేపు కేరింతలు కొడుతూ ఊగింది. ఊయలలో గిరిగిరా తిరిగింది. చివరికి ఆ ఊయలే ఆ పాప పాలిట ఉరితాడైంది. చీరెలో ఇరుక్కుని ఊపిరి ఆడక మృతి చెందింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని నాచారంలో గురువారం చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. నాచారంలో నివసించే వల్లూరి రమేశ్కు భార్య ఇద్దరు పిల్లలు (పాప, బాబు). పాప మనస్విని (9) నాలుగో తరగతి చదువుతున్నది. బాబు మానసిక వికలాంగుడు. గురువారం దంపతులిద్దరూ పని నిమిత్తం బయటకు వెళ్లారు. మనస్విని ఇంట్లో ఫ్యాన్ కొక్కానికి కుర్చివేసుకొని చీరెతో ఊయల కట్టింది. కొద్దిసేపు ఊగింది. అలా ఊగే క్రమంలో మెడకు చీరెచుట్టుకొని ఊపిరి ఆడక చనిపోయింది. తల్లిదండ్రులు వచ్చే చూడగా పాప చీరెలో విగతజీవిగా ఉన్నది.
ఇవి కూడా చదవండి..