పాటియాలా: రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నవారిపైకి ఒక కారు దూసుకొచ్చింది. అనుకోకుండా కారు తమపైకి దూసుకురావడంతో ధర్నాలో కూర్చున్నవారు తలో దిక్కుకు పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్లోని పాటియాలా థాపర్ కాలేజీకి సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది.
పాటియాలాలోని భడ్సో రోడ్డులో రైతులకు మద్దతుగా పలువురు ధర్నాలో కూర్చున్నారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ధర్నాలో కూర్చున్నవారిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, కోపంతో ఉన్న రైతులు భదాస్ రహదారిపై సిట్ సమ్మె ప్రారంభించారు. మృతుడిని పాటియాలలోని రంజిత్నగర్ నివాసి అయిన 65 ఏండ్ల ఇంద్రజిత్ సింగ్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో రితు రాణి, రాహుల్ కుమార్, నైరా, పరమవీర్ సింగ్, దీపు, జాస్, గుర్ప్రీత్ సింగ్, పరమవీర్ సింగ్ ఉన్నారు. కారును వేగంగా నడుపుతూ అదుపుకోల్పోయి ధర్నాలో కూర్చున్నవారిపైకి రావడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, అతడి భార్య, బిడ్డ కూడా గాయపడ్డారు. వారిని కూడా పోలీసులు సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్న స్థితిలో ఉన్నాడని, దాంతోనే కారుపై అదుపు కోల్పోయాడని ప్రమాదాన్ని చూసిన పలువురు తెలిపారు.
తన తండ్రి ఇతరులతో కలిసి భడ్సో రోడ్లో గత 20-25 రోజులుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని, కేంద్రం ఇకనైనా ఇలాంటి మరణాలు జరుగకుండా ఆపేందుకు తమ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మృతుడు ఇంద్రజిత్ సింగ్ కుమారుడు హరీందర్ సింగ్ విజ్ఞప్తిచేశారు.
కాగా, అమృత్సర్లో కూడా ఇలాంటి సంఘటనే జనవరి 26 న జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. కోపోద్రిక్తులైన రైతులు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను ధ్వంసం చేశారు.
బ్రెజిల్లో వ్యాక్సిన్ కొరత.. విదేశాంగ మంత్రి రాజీనామా?
బొగ్గు అక్రమ రవాణా కేసులో సీబీఐ ఎదుట హాజరైన కింగ్పిన్ లాలా
బంగ్లాదేశ్లో మోదీ పర్యటన.. షేక్ హసీనా మెడపై కత్తి
రాజస్థాన్ ఆవిర్భావ దినం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..