వనపర్తి టౌన్, మార్చి 23 : సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల ఉద్యోగులకు పీఆర్సీని పెంచడాన్ని హర్షిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో అంగన్వాడీ, ఆశ వర్కర్లు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పీఆర్సీలో చేర్చడం, వేతనం కూడిన ప్రసూతీ సెలవులు ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ రమాదేవి, నీరజ, రాధాబాయ్ పాల్గొన్నారు.
గెజిటెడ్ ఉద్యోగుల హర్షం
సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడంపై గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆనందం వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ సదుపాయం, క్షేత్రస్థాయిలో పనిచేసే అన్ని వర్గాలకు పీఆర్సీని ప్రకటించడం అభినందనీయని గెజిటెట్ ఉద్యోగుల సంఘం నాయకులు అన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుకర్, చందోజీరావు, యుగేందర్రెడ్డి, జాకీర్హుస్సేన్, శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు కోదండరాములు, మల్లికార్జున్, తిలక్, బాలకృష్ణ ఉన్నారు.
పెద్దమందడిలో..
పెద్దమందడి, మార్చి 23 : సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించి అంగన్వాడీ టీచర్లను చేర్చి వేతనంతో కూడిన ప్రసూతీ సెలవులను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు రమాదేవి, కృష్ణవేణి, చిట్టెమ్మ, రాంచంద్రమ్మ, సరోజ, శారద, ప్రమీల, లక్ష్మి, నాగలక్ష్మీ, హెల్పర్స్ పాల్గొన్నారు.