గూఢచారి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలుకరించింది తెనాలి సుందరి శోభితా దూళిపాళ. ప్రస్తుతం ఈ భామ అడివిశేష్తో కలిసి మేజర్ చిత్రంలో నటిస్తోంది. ఈ బ్యూటీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. తక్కువకాలంలోనే ఈ భామ హాలీవుడ్ ప్రాజెక్టులో నటించే అవకాశం కొట్టేసిందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ డైరెక్టోరియల్ డెబ్యూట్ చిత్రం మంకీ మ్యాన్.
ఈ చిత్రంలో మెయిన్ ఫీమేల్ లీడ్ రోల్కు శోభితను ఎంపిక చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని రూ.200 కోట్లకుపైగా బడ్జెట్తో నెట్ఫ్లిక్స్ నిర్మించబోతున్నట్టు ఇన్సైడ్టాక్. ఓ తెలుగు తార ఇలా అతి తక్కువ సమయంలోనే ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రంలో నటించడం విశేషం. శోభితా దూళిపాళకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు సినీ లవర్స్.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.