నిర్మల్ : జిల్లాలోని బైంసా పట్టణ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో 10 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బుధవారం పాఠశాలలో వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 9 మంది విద్యార్థులకు, సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. వీరిని వెంటనే హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని తెలిసింది.