అంటిగ్వా: సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వెస్టిండీస్.. ఆఖరి వన్డేలోనూ శ్రీలంకను చిత్తుచేసి 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో వన్డేలో డారెన్ బ్రావో (102; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) శతొక్కొట్టడంతో విండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. వణిండు హసరంగ (80 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), అషెన్ బండార (55 నాటౌట్) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో బ్రావో సెంచరీకి.. షై హోప్ (64), కెప్టెన్ పొలార్డ్ (53 నాటౌట్) మెరుపులు తోడవడంతో విండీస్ 48.3 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది.