కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం వీల్చైర్లో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు వీల్చైర్పైనే రోడ్షోలో పాల్గొన్నారు. ఐదు కిలోమీటర్లు సాగిన ఈ ర్యాలీలో పలువురు టీఎంసీ నేతలు ఆమె వెంట ఉన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు 2007 మార్చి14న నందిగ్రామ్లో బలవంతపు భూ సేకరణను అడ్డుకున్నగ్రామస్తులపై పోలీసులు కాల్పులు జరుపగా 14 మంది మరణించారు. మమత అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా మార్చి 14ను నందిగ్రామ్ దివస్గా పాటిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం మమత వీల్చైర్లో ర్యాలీ నిర్వహించారు. నాడు కాల్పుల్లో మరణించిన 14 మందికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ‘నేను గాయపడ్డాను, అనారోగ్యంతో ఉన్నాను. కానీ నా లక్ష్యం మిగిలే ఉంది. నా శరీరం గాయాలతో నిండి ఉంది. అయినా నేను ఈ వీల్ చైర్ మీదనే బెంగాల్ అంతా తిరుగుతా. నేను బెడ్ రెస్ట్ తీసుకుంటే బెంగాల్ ప్రజల వద్దకు ఎవరు వెళ్తారు?’ అని ప్రశ్నించారు. తాను ఎప్పటికి లొంగబోనన్న మమత, గాయపడిన పులి చాలా ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించారు.
ఈ నెల 10న నందిగ్రామ్లో నామినేషన్ అనంతరం కారు డోర్ వద్ద మమతను కొందరు తోసేయడంతో ఆమె కాలికి తీవ్రగాయమైంది. దీంతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తనపై దాడి జరిగిందని, దీని వెనుక కుట్ర ఉన్నదని మమత ఆరోపించారు. అయితే ఆమె ప్రమాదవశాత్తూ గాయప్డడారని, ఇందులో ఎలాంటి కుట్ర లేదంటూ పోలీసులు ఈసీకి నివేదిక ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.