చిత్రసీమలో నాయకానాయికల పారితోషికాల విషయంలో భారీ అంతరం ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కథానాయకుడి ఇమేజ్ చుట్టూ తిరిగే ప్రధాన స్రవంతి సినిమాల్లో వాళ్లే అత్యధిక మొత్తంలో పారితోషికాల్ని స్వీకరిస్తారు. పరిశ్రమలో ఎంతటి అగ్ర కథానాయిక రెమ్యునరేషన్ అయినా రెండుకోట్లకు మించదు. ఈ అంశం మీద అన్ని భాషా పరిశ్రమల్లో ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ వెబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో టాప్ ట్వంటీలో లేని కథానాయకుడికి ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా టాప్ త్రీలో ఉన్న కథానాయికకు ఇచ్చే పారితోషికం తక్కువగా ఉంటుందని సమంత వ్యాఖ్యానించింది. ‘హీరోలు ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా పెద్దగా అభ్యంతరం చెప్పరు. పైగా అతను సక్సెస్లో ఉన్నాడని సమర్ధిస్తారు. అదే కథానాయిక అడిగితే అనవసరమైన డిమాండ్స్ పెడుతోంది..అత్యాశకు పోతుందనే ముద్ర వేస్తారు. ఇండస్ట్రీలో కథానాయికలు అధిక పారితోషికాల్ని డిమాండ్ చేయడం నేరంతో సమానంగా చూస్తారు’ అని సమంత ఘూటుగా స్పందించింది. సమంత వ్యాఖ్యలు దక్షిణాదిలో హాట్టాపిక్గా మారాయి.