ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూట్లోనే వెళ్తోంది. హోమ్లోన్పై వడ్డీరేటును పదేళ్ల కనిష్ఠానికి తగ్గించింది. రూ.75 లక్షలలోపు హోమ్లోన్పై వడ్డీరేటును 6.7 శాతంగానిర్ణయించింది. ఈ కొత్త వడ్డీరేటు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఈ నెల 31 వరకు ఇదే వడ్డీరేటు ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. ఇక రూ.75 లక్షల పైన హోమ్లోన్పై వడ్డీరేటు మాత్రం 6.75 శాతం నుంచి మొదలవనుంది. గత కొన్ని నెలలుగా హోమ్లోన్ కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని, తక్కువ వడ్డీరేట్లు వాళ్లను ఆకర్షిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూర్డ్ అసెట్స్ హెడ్ రవి నారాయనణన్ చెప్పారు.