మంచిర్యాలటౌన్, జూలై 17: హరితహారంలో నాటిన మొ క్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రత్యేకాధికారి, టౌన్ అం డ్ కంట్రీప్లానింగ్ వరంగల్ రీజియన్ డైరెక్టర్ మైకేల్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణితో కలిసి పట్టణంలోని హైటెక్ కాలనీలోని నర్సరీ, శ్రీనిధి లేఅవుట్లోని పట్టణ ప్రకృతివనం, రాశీవనం, రాంచెరువు ఏరియాల్లో మొక్కల పెం పకం, మెయిన్రోడ్లకు మధ్యలో నాటిన మల్టీలెవెల్ ప్లాంటేషన్ను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆయన వెంట టీపీవో సత్యనారాయణ, ఎంఈ మధుకర్, ఏఈ నర్సింహాస్వామి, టీపీఎస్లు యశ్వంత్కుమార్, శ్రీనివాస్, టెక్నికల్ ఆఫీసర్ మధు ఉన్నారు.
మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించాలి
సీసీసీ నస్పూర్, జులై 17: నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రత్యేకాధికారి, టౌన్ అం డ్ కంట్రీప్లానింగ్ వరంగల్ రీజియన్ డైరెక్టర్ మైకేల్ సూచించారు. నస్పూర్ మున్సిపాలిటీలోని నర్సరీలోని మొక్కలను శనివారం సాయంత్రం పరిశీలించారు. మొక్కల వివరాలను సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, టౌన్ప్లానింగ్ అధికారి యశ్వంత్కుమార్, ఈఈ సాయికిరణ్ ఉన్నారు.