జడ్పీ వైస్చైర్మన్ కోనేరు కృష్ణారావు
ఎమ్మెల్యే నివాసంలో బోదకాలు, నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ
కాగజ్నగర్ రూరల్, జూలై 15 : బోదకాలు, నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని జడ్పీ వైస్చైర్మన్ కోనే రు కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే నివాసంలో గురువారం అల్బెండజోలు మాత్రలను పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2-5 ఏళ్లలోపు పిల్లలకు మాత్ర, 6-14 ఏళ్ల వారికి 2 మాత్రలు, 15-19 లోపు వయస్సు వారికి 3 మాత్రలు వేయించాలన్నారు. కార్యక్రమం లో డిప్యూటీ డీఎంహెచ్వో సునీల్రావు, వైద్య సిబ్బంది ఉన్నా రు. అలాగే పలు గ్రామాల్లో వైద్య సిబ్బం ది మాత్రలను పంపిణీ చేశారు. చింతగూడలో ఎంపీడీవో సుశీల్ రెడ్డి , ఏఎన్ఎంలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లిలో..
చింతలమానేపల్లి , జూలై 15: మండలంలోని బాలాజీఅన్కోడలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, మండలకేంద్రంలో డీఆర్డీవో కుటుంబరావు , బాబాసాగర్, హేటిగూడతో పా టు పలు గ్రామాల్లో సర్పంచ్లు, వైద్య సిబ్బం ది బోదకాలు, నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమా ల్లో సర్పంచ్లు, కార్యదర్శులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బెజ్జూర్ మండలంలో..
బెజ్జూర్, జూలై 15 : మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో బెజ్జూర్ పీహెచ్సీ వైద్యాధికారి రుషి ఆధ్వర్యంలో మాస్డ్రగ్ అడ్మినిస్టేషన్ సర్వేను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది 10,259 మందికి మాత్రలను పంపిణీచేసినట్లు వైద్యాధి కారి రుషి తెలిపారు. హెచ్వీ రేణుకా దేవి, నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యదర్శులు, అంగన్వాడీలు, తదితరులు పాల్గొన్నారు.
చిన్నరాస్పల్లిలో..
దహెగాం, జూలై 15 : మండలంలోని చిన్నరాస్పల్లిలో ఎంపీపీ కంభగౌని సులోచన, గ్రామాల్లో సర్పంచ్లు, వైద్యసిబ్బంది డీఈసీ మాత్రలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్గౌడ్, సింగిల్విండో వైస్చైర్మన్ రాపర్తి ధనుంజయ్, సర్పంచ్లు పుప్పాల లక్ష్మి, తుమ్మిడ అమృత, ఎంపీడీవో సత్యనారాయణ, వైద్యాధికారి చంద్రకిరణ్, సర్పంచ్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కౌటాల మండలకేంద్రంలో..
కౌటాల, జూలై 15: మండల కేంద్రంలో ఎంపీపీ బసార్కర్ విశ్వ నాథ్ అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. కార్యక్రమంలో వైద్యాధికారి కృష్ణ ప్రసాద్, సర్పంచ్ వొజ్జల మౌనిశ్, ఉపసర్పంచ్ పసునూరి తిరుపతి, ఏఎన్ఎం రజినీ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, నాయకుడు డబ్బా బాపు ఉన్నారు.
పెంచికల్పేట్ పీహెచ్సీలో..
పెంచికల్పేట్ , జూలై 15: మండలకేంద్రంలోని పీహెచ్సీలో జడ్పీటీసీ సముద్రాల సరిత మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి ముస్తఫా, ఎంపీటీసీ దూగుంట రాజన్న, వైద్యాధికారి ముస్తఫా, హెచ్ఎస్లు లతశ్రీ, రవిదాస్, హెచ్ఈవో కోటేశ్వర్రావు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రంలో..
ఆసిఫాబాద్, జూలై 15 : జిల్లాకేంద్రంలోని బాపునగర్లో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు మాత్రలు పంపిణీ చేశారు. వైద్యాధికారి సత్య నారాయణ, ఆరోగ్య పర్యవేక్షకుడు శ్యాంలాల్, రాధిక, సిబ్బంది ఉ త్తం, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
రెబ్బెన మండలకేంద్రంలో..
రెబ్బెన, జూలై 15: మండలకేంద్రంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్ కరపత్రాలు విడుదల చేసి, మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ భరత్, సర్పంచ్ బొమ్మినేని అహల్యాదేవి, ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, ఎంపీటీసీ పెసరి మధునయ్య, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సీనియర్ నాయకుడు జుమ్మిడి ఆనందరావు. వైద్య సిబ్బంది ఉన్నారు.
ఝరి గ్రామంలో..
కెరమెరి, జూలై 15: మండలంలోని ఝరి గ్రామంలో పీహెచ్సీ వై ద్యాధికారి సుంకన్న ఆధ్వర్యంలో ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకీ దుర్పతాబాయి మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుంకన్న, సూపర్ వైజర్ కరుణేశ్వరి, సర్పంచ్ కుమ్రం నాణేశ్వర్, అంగన్వాడీ టీచర్ సరోజ, నాయకులు ఆత్రం లక్ష్మణ్రావ్, షేక్ యూసుఫ్, దందురావ్, కుసుంరావ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.