హాజీపూర్, సెప్టెంబర్ 24 : వచ్చే యాసంగిలో రైతులు వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్ సూచించారు. పంట మార్పిడి, ప్రత్యామ్నయ పంటల సాగుపై గుడిపేట, కర్నమామిడి, ముల్కల్ల క్లస్టర్ పరిధిలోని రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ నాయక్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా దొడ్డు రకం వడ్లను కొనడం నిలిపివేయనుందని తెలిపారు. రైతులు పప్పుదినుసులు లేదా నూనె గింజలు, చిరు ధాన్యాలైన కొర్రలు, సామలు, సజ్జలు, నువ్వులు, మొక్క జొన్న, వేరుశనగ, పెసర, కుసుమ, పొద్దు తిరుగుడు, జొన్నతో పాటు పంట మార్పిడి పద్ధతిని పాటిస్తూ కూరగాయలపై దృష్టిసారించాలన్నారు. యాసంగిలో సన్న రకాల వరి ధాన్యాన్ని మా త్రమే పండించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరయ్య, మండల వ్యవసాయ అధికారి మార్గం రజిత, మండల రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ పూస్కూరి శ్రీనివాస్ రావు, సర్పంచ్లు కొట్టె మహేందర్, మంచాల శ్రీనివాస్, లగిశెట్టి లక్ష్మి, గుడిపేట ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, కర్నమామిడి పీఏసీఎస్ చైర్మన్ కొట్టె సత్తయ్య, ఆత్మ చైర్మన్ మల్లారెడ్డి రైతులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి మండలంలో..
బెల్లంపల్లిరూరల్, సెప్టెంబర్ 24: ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై తాళ్లగురిజాల రైతు వేదిక భవనంలో అధికారులు అవగాహన కల్పించారు. రైతులు సంఘాలుగా ఏర్పడి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి, ఎంపీపీ గోమాస శ్రీనివా స్, మండల వ్యవసాయాధికారి సుద్దాల ప్రేమ్కుమార్, గురిజాల సర్పంచ్ గాజుల రంజిత, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సింగం గణేశ్గౌడ్, లంబాడీతండా, మాలగురిజాల సర్పంచ్లు గుర్రాల రాయమల్లు, గోమాస అశోక్కుమార్, ఏఈవో శ్రీనివాస్ , రైతులు పాల్గొన్నారు.
తాండూర్ మండలంలో..
తాండూర్, సెప్టెంబర్ 24 : నీటి లభ్యత, నేల స్వభావం, విత్తే సమయం ఆధారంగా పంటలు వేసుకోవాలని బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త నాగరాజు రైతులకు సూచించారు. మండలంలోని కొత్తపల్లి, కిష్టంపేట, రేచిని రైతువేదికలలో పంట మార్పిడి విధానంపై వ్యవసాయ శాఖ అధికారి కిరణ్మయి ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ ఏల్పుల రజిత, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ దత్తాత్రేయరావు, ఏఈవోలు శంకర్, పుష్పలత, ప్రతిభ, గ్రామ కో ఆర్డినేటర్లు, రైతులున్నారు.
దండేపల్లి మండలంలో..
దండేపల్లి, సెప్టెంబర్ 24 : దండేపల్లి మండల కేంద్రంతో పాటు ద్వారక గ్రామాల్లో పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలపై మండల ఏవో అంజిత్కుమార్, ఏఈవో రజిత అవగాహన కల్పించారు.
లక్షెట్టిపేట మండలంలో..
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 24: వచ్చే యాసంగిలో పంట మార్పిడి లేదా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని మండల ఏవో ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్కూర్, జెండా వెంకటాపూర్లో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ నడిమెట్ల రాజన్న, ఏఈవోలు ప్రసన్న, మనీషా, పాల్గొన్నారు.
భీమారం మండలంలో..
భీమారం సెప్టెంబర్ 24 రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని చెన్నూర్ ఏడీఏ బాపు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక భవనంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కలగూర రాజ్ కుమార్ , సర్పంచ్ గద్దెరాంరెడ్డి , ఏవో మార్కు గ్లాడ్సన్, ఏఈవో అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, సెప్టెంబర్ 24 : పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలపై ఎంపీపీ మంత్రి సురేఖ అధ్యక్షతన ఏవో మహేందర్ కోటపల్లి రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో రాజ్ కుమార్, రైతులున్నారు.
జైపూర్ మండలంలో..
జైపూర్, సెప్టెంబర్ 24: జైపూర్లోని రైతు వేదికలో రైతులకు ఏడీఏ బాపు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీటీసీ లింగస్వామి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బేతు తిరుపతి రెడ్డి, ఏవో మార్క్గ్లాడ్సన్, ఏఈవోలు కొమురయ్య తదితరులున్నారు.