దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రంగంపెల్లి సమీపంలో గురువారం సాయంత్రం పిడుగు పడటంతో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వెంకటాపూర్కు చెందిన బోడకుంటి మల్లయ్య, ముత్యంపేటకు సంగె ప్రమీల ఇద్దరు అన్నాచెల్లెలు. ద్విచక్ర వాహనంపై వెల్గనూర్కు చెందిన బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు.ఇంతలో భారీ వర్షానికి తోడు ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారి మారిపోవడంతో ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని ఆపి రోడ్డు ప్రక్కన నిల్చున్నారు.
సమీపంలో చెట్టుపై ఒక్కసారి పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు ఇద్దరిని 108 అంబులెన్స్లో మంచిర్యాల దవాఖానకు తరలించారు