భూత్పూర్: పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం నియోజక వర్గంలోని అడ్డాకుల, దేవరకద్ర మండల కమిటీలను ఇన్చార్జి నాగేం దర్గౌడ్ సమక్షంలో ఏర్పాటు చేశారు. కమిటీలు పార్టీని పట్టింగా నిలబెట్టేందుకు పనిచేయాలని ఆయన కోరారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలుచేయనన్ని పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
60లక్షల కార్యకర్తలు సభ్యత్వం కలిగిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో కార్యక ర్తలుగా ఉండడం మన అదృష్టమని అన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు ఎంతో కృతనిశ్చయంతో పనిచేశారని ఆయ న తెలిపారు. గత ఏడేండ్లలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి సాధించిందని ఆయన తెలిపారు.
అనంతరం అడ్డాకుల మండలాధ్యక్షుడిగా తోకల శ్రీనివాస్రెడ్డి, యువత విభాగం అధ్యక్షుడు బాల్రాజ్, దేవరకద్ర మండలా ధ్యక్షుడిగా జెట్టి నర్సింహారెడ్డి, యువత విభాగం అధ్యక్షుడిగి యుగంధర్రెడ్డిని నియమించారు. కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎంపీపీలు నాగార్జునరెడ్డి, రమా శ్రీకాంత్ యాదవ్, నాయకులు పొనకల్ మహమూద్, శ్రీకాంత్రెడ్డి, కొండాశ్రీనివాస్రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.