మహబూబ్నగర్ : మక్తల్ నియోజకవర్గ కేంద్రం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి ఉన్న ఆర్ అండ్ బీ రహదారి అధ్వాన స్థితికి చేరుకుందని వెంటనే పనులు చేపట్టాలని మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ రోడ్డును మంజూరు చేసిందని, కానీ కాంట్రాక్టర్ వల్ల పనులు ప్రారంభం కాలేదని తెలిపారు.
వెంటనే పనులు ప్రారంభమయ్యేలా సంబంధిత శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.